ఇద్దరు రేంజ్ ఆఫీసర్స్, ఓ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్
Published: Monday June 14, 2021
జన్నారం, జూన్ 13, ప్రజాపాలన ప్రతినిధి : కవ్వాల పులుల అభయారణ్యం లోని ఇద్దరు రేంజ్ ఆఫీసర్లను, ఓ సెక్షన్ ఆఫీసర్ ను నిర్మల్ ఎఫ్.డి.పి.టి వినోద్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, కలప అక్రమ రవాణా, ఓ మహిళ బీట్ ఆఫీసర్ వ్యవహారం, తదితర అభియోగాల మేరకు వారిపై వేటు వేసినట్లు సమాచారం. జన్నారం రేంజ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, గతంలో ఇక్కడ పనిచేసి, ప్రస్తుతం దిమ్మ దుర్తి లో పనిచేస్తున్న రేంజ్ ఆఫీసర్ కల్పనాదేవి ని, చింతగూడ సెక్షన్ ఆఫీసర్ నహేదా పర్వీన్ లను సస్పెండ్ చేశారు. ఈమేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు వచ్చినట్లు స్థానిక ఎఫ్.డి.ఓ మాధవరావు తెలిపారు. సస్పెన్షన్ ఉత్తర్వులను వారికి పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
Share this on your social network: