ఆలంపల్లి యాదయ్య కుటుంబానికి ఆర్థిక చేయూత

Published: Wednesday April 05, 2023
* ధారూర్ మండల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాజుగుప్తా
వికారాబాద్ బ్యూరో 4 ఏప్రిల్ ప్రజా పాలన : ప్రమాదం కారణంగా చనిపోయిన ఆలంపల్లి యాదయ్య కుటుంబానికి ఆర్థిక సహకారం అందజేశామని ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజు గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరూర్ మండల పరిధిలోని మోమిన్ కలాన్ గ్రామానికి చెందిన ఆలంపల్లి యాదయ్య గత 15 రోజుల క్రితం యాక్సిడెంట్ లో మృతి చెందాడు. వీరి కుటుంబం మహారాష్ట్రలోని బొంబాయి నగరంలో జీవిస్తుండడం కారణంగా మోమిన్ కలాన్ గ్రామానికి రావడం ఆలస్యమైందని వివరించారు. గ్రామానికి వచ్చిన ఆలంపల్లి యాదయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు 3000 రూపాయలు ఆర్థిక సహకారం అందజేశామని  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మోమిన్ కలాన్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.