మిల్లర్ల దోపిడిపై కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Published: Tuesday December 07, 2021
జగిత్యాల, డిసెంబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణలో మిల్లర్ల ఒత్తిడితో రైతాంగం తీవ్ర దోపిడికి గురవుతున్నారని రైతులకు రక్షణ కల్పించాలని కోరుతూ హైదరాబాద్ లోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. వరిదాన్యం సెంటర్లలో వడ్లు పోసి నెల రోజులు గడుస్తున్నా తూకం అంశంలో మిల్లర్ల యజమానులు వేధిస్తున్నారని జీవన్ రెడ్డి వినతిపత్రంలో ఆవేదన వ్యక్తంచేశారు.
Share this on your social network: