ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
Published: Thursday December 15, 2022
సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు
బోనకల్ డిసెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ కు బుధవారం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, కో కన్వీనర్ గుగులోతు నరేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశావర్కర్లు కరోనకాలంలో కీలక పాత్ర పోషించారని, అటువంటి వారికి కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆశ వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు అప్పాచారి, ఆశా కార్యకర్తలు పి విజయలక్ష్మి, వంగల దుర్గా పాల్గొన్నారు.
Share this on your social network: