ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ ఓబీసీ మోర్చా కన్వీనర్గా రావుల బాలకృష్ణ గౌడ్

Published: Wednesday June 30, 2021
మేడిపల్లి, జూన్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ నియోజకవర్గం బీజేపీ ఓబీసీ మోర్చా కన్వీనర్ గా ఉప్పలకు చెందిన రావుల బాలకృష్ణ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు జే వి ఎ న్ మంగేష్ కుమార్ ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ ఓబీసీ మోర్చా కన్వీనర్ గా రావుల బాలకృష్ణ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రావుల బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలను అందర్నీ కలుపుకు పోతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవిలో నియమించినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మేడ్చల్_మల్కాజ్ గిరి జిల్లా అర్బన్ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు జే వి ఎ న్ మంగేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు.