మృతుల కుటుంబాలను పరామర్శించిన తెరాస అధికార ప్రతినిధి, వేణుగోపాల చారి

Published: Monday June 21, 2021

బెల్లంపల్లి, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి: ఆసిఫాబాద్ కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఇటీవల మృతి చెందిన మాజీ జెడ్పిటిసి రామ్ బ్రహ్మం, మాజీ కౌన్సిలర్ జానీ మియా కుటుంబ సభ్యులను శనివారం కలిసి పరామర్శించారు తెరాస అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామబ్రహ్మం జానీ మియాల మృతి పార్టీకి కాగజ్నగర్ పట్టణ ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటని సానుభూతి సంతాపాన్ని తెలిపి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న భోజన శాలను సందర్శించారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బెల్లంపల్లి పట్టణానికి చెందిన తెరాస నాయకులు మురుకూరి చంద్రయ్య, కౌన్సిలర్ గెళ్లి రాజలింగు, తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్ కుమార్ పాండే, తదితరులు హాజరయ్యారు.