త్వరలో పూర్తి కానున్న అండర్ డ్రైనేజీ పనులు
Published: Tuesday February 08, 2022
మేకవనంపల్లి సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 07 ఫిబ్రవరి ప్రజాపాలన : గ్రామాభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని మేకవనంపల్లి గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి అన్నారు. సోమవారం మోమిన్ పేట్ మండల పరిధిలోని మేకవనంపల్లీలో అండర్ డ్రైనేజీ నిర్మాణపు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అండర్ డ్రైనేజీ నిర్మాణపు పనులు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. గ్రామానికి కావలసిన కనీస అవసరాలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. జంగం బాబు ఇంటి నుండి గ్రామ పంచాయతీ వరకు వేసిన అండర్ డ్రైనేజీ పైపులైనుపై మట్టి పూడ్చడం పనులు జరుగుతున్నాయని వివరించారు. మ్యాన్యువల్ నిర్మాణాలు పూర్తైన వాటికి వాటర్ క్యూరింగ్ చేయిస్తున్నామని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి, కారోబార్ కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: