విద్యార్థుల సమయనుకూలంగా బస్సులు నడపాలి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ

Published: Saturday October 02, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్  ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఇబ్రహీంపట్నం బస్ డిపో మేనేజర్ గారికి విద్యార్థుల సమయం అనుకూలంగా బస్సులు నడపాలని వినతి పత్రం ఇవ్వడం  జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిలువేరు రాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పంది జగన్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాల విద్యార్థులు విద్యా సంస్థలకు పోవడానికి బస్సులు సమయానికి రాక ఇబ్బందుల పాలు పడుతున్నారని అన్నారు పోల్కంపల్లి గ్రామానికి అనాజ్ పూర్ బస్ గతంలో వచ్చేది దానివల్ల విద్యార్థులకు ఉపయోగ కరంగా ఉండేదని ఇప్పుడు దాన్ని తొలగించడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని బస్సులు యదా విధిగా నడిపించాలని తెలిపారు లోయపల్లి గ్రామం నుండి వచ్చే బస్సులను చాలావరకు తొలగించాలని అని వారు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండి సమయానుకూలంగా బస్సులు నడపాలని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ బాబు రావు కోరారు లేనిపక్షంలో వారి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చందు నాయక్ పీ స్టాలిన్ కె మహేష్ మంతన్ గౌరెల్లి ఉపసర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.