మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డిని సన్మానించిన కౌన్సిలర్ సుధాకర్

Published: Wednesday August 18, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 17, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డిని కౌన్సిలర్ మంద సుధాకర్ సోమవారం మున్సిపల్ కార్యాలయంలో శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ నెల 15వ తేదీన పంద్రాగస్టు రోజున విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న నేపథ్యంలో సన్మానించడం జరిగిందని మంద సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సురమోని సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది అశోక్, సాయి, కృష్ణారెడ్డి, లింగం, జహంగీర్, మాణిక్యం, మైనార్టీ నాయకులు ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.