ఘనంగా అష్ఫాఖుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ 94వ వర్దంతి

Published: Monday December 20, 2021
బెల్లంపల్లి: డిసెంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 18వ వార్డు కాంట్రాక్టర్ బస్తి లో ఆల్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో  ఆదివారం స్వంతంత్ర సమరయోధులు అష్ఫాఖుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ 94వ వర్దంతి ని ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు అష్ఫాఖుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు . అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నాను అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడని అన్నారు. ఆర్య సమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్ తో సాంప్రదాయ ముస్లిం మతస్థుడైన అష్ఫాకుల్లా ఖాన్ యొక్క స్నేహము కొంత విభిన్నమైనదే అయినా వారిద్దరి సమష్టి లక్ష్యము ఒకటే నని భావించి భారత స్వాతంత్ర ఉద్యమంలో మిత్రుల య్యారని పేర్కొన్నారు. ఇద్దరూ ఒకే రోజు, కాకపోయిన వేర్వేరు జైళ్లలో భారతదేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణాలు అర్పించారని దేశానికీ వీరు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అన్వర్ ఖాన్, అన్వరుద్దీన్, యండి.జాఫర్, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, ఖాజా మొయి నుద్దీన్, యండి.ముస్తఫా, రసూల్ షరీఫ్, బాబు జానీ, యూత్ కమిటీ వర్కింగ్ ప్రెసి డెంట్ ఫెరోజ్ ఖాన్, తాజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.