దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి

Published: Saturday October 01, 2022
మేడిపల్లి, సెప్టెంబర్30 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ భగయత్ లేఅవుట్ లో ఉన్న బొప్పాన్ చెరువు కట్ట మైసమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా షామీర్పేట్ వినోద్ రెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా   ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని 
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు రాగిడి లక్ష్మారెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కంచె మీది శివయ్య, బోనాల సుధాకర్, ఉపేందర్, రెడ్డి గారి సంజీవరెడ్డి, చంద్రారెడ్డి, నరసింహ, స్వామి, సుమన్ శర్మ, చింతల నరసింహ, రమ కాంత్ రెడ్డి, రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకర్ శెట్టి,   సంజయ్ జైన్, వంజరి సంతోష్, రాజు, సాయిబాబా, కరిపే మల్లికార్జున్, సురేష్ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area