బిసి కమీషన్ ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేస్తుంది : రాష్ట్ర బిసి కమీషన్ సభ్యులు నూలి శు
Published: Wednesday September 15, 2021
వికారాబాద్ బ్యూరో 14 సెప్టెంబర్ ప్రజాపాలన: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశానని బిసి కమీషన్ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాశీస్సులు పొందాను అన్నారు. స్పందించిన ఎమ్మెల్సీ బడుగు వర్గాల హక్కుల కోసం కమీషన్ పనిచేయాలని సూచించారని పేర్కొన్నారు. బడుగు వర్గాల సమస్యలపై ప్రభుత్వానికి ప్రజలకు కమీషన్ వారధిలా పనిచేయాలని ఆమె హితవు పలికారని గుర్తు చేశారు.
Share this on your social network: