రంజాన్ కానుకల పంపిణీ

Published: Saturday May 08, 2021
వెల్గటూర్ 07, (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని శాఖపూర్ గ్రామంలో ముస్లిం-మైనారిటీ ప్రజల అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే కానుక దుస్తులను సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ ఆదేశాలతో యం.పి.పి శ్రీమతి శ్రీ కునమల్ల లక్ష్మి  పంపిణీ చేశారు. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంతోషమే ధ్యేయంగా సమన్వయ పాలన కొనసాగుతున్నది అని, ఇంతటి కరోనా కష్టకాలంలో సైతం ఆగని సంక్షేమ పథకాలు అమలు అవుతున్న తీరు కే.సీ.ఆర్ పాలనకు నిదర్శనం అని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికీ మైనారిటీ శాఖ ద్వారా పెద్ద పీట వేసిందని అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్, సర్పంచ్ బాలసాని సత్యం, తెరాస మైనారిటీ అధ్యక్షుడు మహ్మద్ సలీం, తహశీల్దార్ యం.రాజేంధర్, మైనారిటీ సంఘ నాయకులు రహీం, ఖజామియా, లాల్ మహ్మద్, అబ్దుల్లా, సహేబ్హుస్సేన్, అఫ్సర్, అంకూస్, తదితరులు పాల్గొన్నారు.