టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న మేయర్లు జక్క వెంకట్ రెడ్డి సామల బుచ్చిరె

Published: Thursday October 28, 2021
మేడిపల్లి, అక్టోబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) కార్మికశాఖ మంత్రివర్యులు చామాకూర మల్లారెడ్డి  ఆధ్వర్యంలో అలియాబాద్లో జరిగిన మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి, పార్టీని బలపర్చి, ప్రజల నమ్మకాన్ని కాపాడాలని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, యువజన విభాగం తదితరులుపాల్గొన్నారు.