3వ డివిజన్లో 5 కాలనీలకు మంచినీళ్ల : కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్

Published: Thursday May 06, 2021
మేడిపల్లి, మే5 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచర్ల 3వడివిజన్లో 5 కాలనీలకు త్వరలో మంచినీళ్లు అందిస్తున్నట్లు స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు కార్పొరేటర్ చందర్ గౌడ్ కాంట్రాక్టర్ తో కలిసి వేంకటాద్రి కాలనీ, దత్తాత్రేయ, వెంకటసాయి, హరితవనం, కృష్ణానగర్ కాలనీలో పైప్లైన్ కొలతలు చేపట్టడం జరిగింది. మంచినీళ్ల పైప్లైన్ను త్వరగా వేసి ఈ కాలనీ వాసులకు మంచినీళ్లు తాగించాలని కార్పొరేటర్ చందర్ గౌడ్ ను కాలనీవాసులు కోరారు. మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతో కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ కృషితో ఈ 5 కాలనీవారు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న త్రాగునీరు వచ్చేటట్లు చొరవ తీసుకున్నందుకు వారికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్, ఆయా కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులుు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.