బంటి యూత్ ఫోర్స్ వ్యవస్థాపకుడు బొట్టు ప్రవీణ్
Published: Friday June 17, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 16 ప్రజాపాలన ప్రతినిధి.
యాచారం మండల పరిధిలోని లోయపల్లి గ్రామానికి చెందిన గొల్ల యాదయ్య నాలుగు రోజుల క్రితం మరణించడం జరిగింది. వారు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కాబట్టి పేదలకు సహాయం చేసిన గొప్ప మనసున్న బొట్టు ప్రవీణ్ ఏ పేదవాడికి ఆపద వచ్చిన నేనున్నానంటూ బంటి యూత్ ఫోర్స్ అండగా ఉంటుందని టిఆర్ఎస్ పార్టీ మరియు (BYF) బంటి యూత్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు బొట్టు ప్రవీణ్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక క్వింటాల్ బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పాలకూర జానయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి బికేఅర్ , మాజీ సర్పంచ్ నారీ యాదయ్య, తెరాస పార్టీ సీనియర్ నాయకులు మిద్దె ధనుంజయ గౌడ్, నర్సింగ్ ఓంకార్ గౌడ్ సదానంద గౌడ్ యూత్ నాయకులు నాగేష్ నారి మల్లేష్ అనిల్ సంపత్ నాగరాజు లోకేష్ నవీన్ చింటూ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: