లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్ మండలంలో పర్యటించి పలు కుటుంబాల

Published: Friday August 26, 2022

బోనకల్, ఆగస్టు 25 ప్రజా పాలన ప్రతినిధి:  గురువారం  మండలంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పర్యటించారు. అందులో భాగంగా మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామంలో రైతు వేదిక నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సిఫార్సు మేరకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో  మండలంలోని 12 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన రూ. 3,23000/- లక్షల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం చిరునోముల  గ్రామంలో ఇటీవల మరణించిన టీ.ఆర్.ఎస్ నాయకులు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తెల్లబోయిన రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ పగాడు తెలియజేశారు. అదే విధంగా గ్రామంలో మండల నవతెలంగాణ  సీనియర్ పాత్రికేయులు తేనే వెంకటేశ్వర్లు ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకొని చుండగా  వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున్, మోదుగుల నాగేశ్వరరావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, బంధం శ్రీను, కొనకంచి నాగరాజు, బానోత్ కొండ, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.