కొడంగల్లో బంజారా భవన నిర్మాణం మంజూరు

Published: Monday August 09, 2021
కోటి రూపాయల నిధులు విడదల
నెరవేరిన గిరిపుత్రుల నిరీక్షణ కల
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 08 ఆగస్ట్ ప్రజాపాలన : శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కొడంగల్ నియోజకవర్గ గిరిపుత్రులు ఘనంగా సత్కరించారు. కొడంగల్ నియోజకవర్గములో బంజారా భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరుతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అభ్యర్థనతో బంజారా భవనానికి కోటి రూపాయలు మంజూరు చేయించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గిరిజన సంఘం ప్రతినిధులు ప్రత్యేక అభివందనాలు తెలిపారు. ఆదివారం నగరంలోని శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసానికి పెద్ద ఎత్తున గిరిజనులు తరలివెళ్ళి విద్యా శాఖ మంత్రిని సన్మానించారు.