ఉపాధికి హామీ చట్టానికి ఉరి వేసిన కేంద్ర బడ్జెట్* *యాచారం నంది వనపర్తి మాల్ గ్రామాలల్లో బడ్జె

Published: Friday February 03, 2023

*ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పి అంజయ్య  మాట్లాడుతూ నిన్న ఆర్భాటంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి. ఆహార సబ్సిడీ.రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీల పైన భారీ ఎత్తున కోత విధించడం వలన గ్రామీణ ప్రాంత పేదల నోట్లో మట్టి కొట్టిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ అభిప్రాయప డుతున్నది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను నిరసిస్తూ  ఉపాధి కూలీల తో ఆందోళనలు చేయాడం జరిగింది. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో  ఉపాధి కూలీలకు 100 రోజులు పని కల్పించాలంటే  1.85.000 కోట్ల బడ్జెట్ అవసరం.గత బడ్జెట్లో 89 వేల కోట్ల రూపాయలను  కేటాయించిన మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 60 వేలకోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది 40% పైగా నిధులను తగ్గించడం అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా కూలీలకు 35 రోజులు మాత్రమే  పనిని కల్పిస్తుంది  క్రమంగా  ఉపాధి హామీ బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడడం దేశంలో 15 కోట్ల కుటుంబాలను ఉపాధికి దూరం చేయడమే అవుతుంది.మన రాష్ట్రంలో 55 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాల మీద తీవ్రమైన ప్రభావం పడనున్నది గ్రామీణ ప్రాంత పేదలకు ఆహార భద్రతను కల్పించడం కోసం గత సంవత్సరం 2, 87, 194  కోట్లను బడ్జెట్లో కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో 1, 97,350 కోట్లకు తగ్గించింది అంటే సబ్సిడీ బియ్యం గోధుమలు పిండి పామాయిల్ వంటివి అందించే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం  తప్పుకోవాలని  చూస్తున్నది రైతులకు అందించే ఇన్పుట్ సబ్సిడీ రెండు లక్షల 25 వేల కోట్లు గత బడ్జెట్లో కేటాయించిన మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 1,75 వేల కోట్లకు తగ్గించింది ఒక్క యూరియా పైన నే 15 వేల కోట్లను తగ్గించటం ఆందోళన కలిగిస్తున్నది గిట్టుబాటు ధరల గురించి చట్టం తీసుకొస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం మాట వరసకు కూడా  మాట్లాడ కపోవడం రైతుల మీద ఉన్న కపట ప్రేమకు నిదర్శనం. భడ్జెట్  మొత్తం కార్పొరేట్ శక్తుల  కొమ్ము కాసేదానిగా వుంది  వెంటనే ఈ బడ్జెట్ ని ఉపసంహరించాలని  ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎచ్చరిస్తున్నాము  కార్యక్రమంలో అధ్యక్షులు కందుల శ్రీరాములు. జిల్లా నాయకులు  ఎం జంగయ్య,   మండల నాయకులు  బి ఇందిరమ్మ, ఎం అంజయ్య,  ఈశ్వరయ్య,  జాంగిర్,  యాదమ్మ,    మంగమ్మ,  అండాలు,  సరిత, అగ్బర్,   ఈశ్వర్, రాములు, తదితరులు పాల్గొన్నారు,