కలయిక వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు మధిర మధిర

Published: Monday August 08, 2022

ఆగస్టు 7 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవ సందర్భంగా

కలయిక వాకర్స్ క్లబ్ సభ్యులు తో పలగాని వెంచర్ లో అధ్యక్షులు ఇరుకుళ్ళ బాలకోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

సభ్యులందరూ పరస్పరం ప్రెండ్ షిప్ డే బాడ్జెలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకుని కేక్ తినుపించుకున్నారు. స్నేహితుల దినోత్సవం, స్నేహం ప్రాముఖ్యత తదితర విషయాలపై సభ్యులమధ్య చిన్న వక్తృత్వ పోటీ నిర్వహించారు. వాకర్స్ సభ్యులు, న్యాయవాది దురిశాల జగన్మోహనరావు, హీరోహోండా సుధాకర్ రెడ్డి, ఆర్.టి.సి.వెంకన్న ప్రధమ,ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందారు. తల్లి తండ్రులు, తోబుట్టువుల ఎన్నిక భగవంతుడు నిర్ణయిస్తే, స్నేహితుడ్ని ఎన్నుకునే అవకాశం మనకే వుంటుందని, మంచి స్నేహితుడిని సంపాదించుకుని ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సభ్యులు ప్రసంగించారు.

న్యాయవాది దురిశాల జగన్మోహనరావు పుట్టినరోజు వేడుక కూడా జరిపారు. సభ్యులందరు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వాకర్స్ క్లబ్ సభ్యుడు నేరెళ్ళ శ్రీనివాసరావు కుమారుడు భరత్ సాయి ఇటీవల జరిగిన 10 వ తరగతి పరీక్షలో 10/10 మార్కులు సాధించిన సందర్భంగా, ఇదేరోజు పుట్టినరోజు కూడా జరుపుకున్నందున సభ్యులందరూ భరత్ సాయి కి అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు.