రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ జగన్ వెంకటయ్య. మరియు రాఘవేంద

Published: Tuesday May 04, 2021
పరిగి, 3 మే ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి  గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ జగన్ వెంకటయ్య మరియు రాఘవేందర్ రెడ్డి. సి సి లక్ష్మారెడ్డి. మరియు మహిళా సంఘం అధ్యక్షురాలు బీమమ్మ ప్రారభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దళారుల చేతులో మోసపోకుండా కేసీ ఆర్ ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది అన్నారు. వీటిని రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలోస్కూల్ చైర్మన్ బోయ రవి. సాయిలు.  రైతులు తదితరులు పాల్గొన్నారు.