ఐక్య పోరాటాలతో హక్కులు సాదించుకోవాలి
Published: Monday September 13, 2021
తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల దాసు
బెల్లంపల్లి, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లాల తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని బలోపేతం చేసి హక్కుల సాధన కోసం కలిసికట్టుగా పోరాటం చేయాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మేకల దాస్ అన్నారు. ఆదివారం నాడు స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎల్తూరి శంకర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో కార్మిక సంఘాన్ని బలోపేతం చేసి హక్కుల సాధన కోసం కలసి కట్టుగా పోరాటం చేయాలని, మోడీ, కె సి ఆర్ చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు పోరాటంతో మెడలు వంచి హక్కులు సాధించు కోవాలని అన్నారు. అక్టోబర్ నెలలో జరిగే రాష్ట్ర మహాసభకు జిల్లా ప్రతినిదులు హాజరు కావాలని అన్నారు. ఈ మహాసభలో ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామి, చిప్ప నరసయ్యలు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభలో సి పి ఐ రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు గుండ మాణిక్యం, భవన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జాడి పోశం, వివిధ మండల మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
Share this on your social network: