రైతులకు పట్టాలివ్వాలని కలెక్టరేట్ ఎదుట బిజెపి ధర్నా. .. రైతులు సాగు చేసుకుంటున్న భూముల కు పట్

Published: Tuesday January 03, 2023
మంచిర్యాల బ్యూరో, జనవరి02, ప్రజాపాలన.
 
నేన్నేల్ మండలము లోనీ నేనెల్ శివరములో సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ మంచిర్యాల  జిల్లా కలెక్టర్ కార్యాలయo ముందు సోమవారం రైతులు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భారతీ హోలికేరీ
 కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ బెల్లంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నేన్నెల షివరములో 672 సర్వే నంబర్ లో రైతులు గత 50 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారని , వారికి గత ప్రభుత్వము పట్ట పాస్ పుస్తకాలు ఇచ్చిందని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతులకు రావలసిన పథకాలు అందడం లేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ విచారణ జరిపించి కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు నిర్లక్షం వల్లనే సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేనెలా మండల అధ్యక్షులు శైలేంద్ర సింగ్, భీమిని అధ్యక్షులు భీమయ్య, గజేందర్ సింగ్, ఇందురి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.