మహాత్మ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందాళ.
Published: Thursday September 08, 2022
పాలేరు సెప్టెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి
కూసుమంచి మండలంకి సంబంధించిన మహాత్మ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి, ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలోని త్రాగునీరుని పరిశీలించారు.విద్యార్థులతో ముచ్చటించారు.పాఠశాలలోని వసతుల గురుంచి విద్యార్థులను అడిగి స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పిల్లలందరినీ మీ పిల్లలవలే మమేకం చేసుకోవాలని కోరారు.
Share this on your social network: