కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం

Published: Wednesday May 12, 2021

ప్రమాదంలో మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి ఇన్సూరెన్స్ డబ్బుల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
గుమ్మడిదల, మే11 (ప్రజాపాలన ప్రతినిధి) : టిఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ  అని పటాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండల పరిధిలోని కానుకుంట గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు తెరాస పార్టీ లో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇతనికి టిఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉండటంతో పార్టీ తరపున రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు మంజూరయ్యాయి. పటాన్చెరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా మృతుడి కుటుంబానికి మంగళవారం ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా నిలుస్తూ, ప్రతి కార్యకర్త కు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కిందని ఆయనకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కుమార్ గౌడ్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి,సద్ది విజయ భాస్కర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.