జిల్లా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి

Published: Thursday July 07, 2022
జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి **
 
జిల్లా అధికారులతో సమావేశం  **
 
ఆసిఫాబాద్ జిల్లా జులై 06 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో నెలకొన్న సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవ లక్ష్మి  మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలలు శుభ్రంగా ఉంచాలని, డిఈఓ కు సూచించారు. వర్షాకాలం కావడంతో గ్రామాలలోని డ్రైనేజీ సమస్యలు, సీజనల్ వ్యాధుల పట్ల శ్రద్ధ వహించాలని డిపిఓ రమేష్ కు సూచించారు. జిల్లాలో జరుగుతున్న  అన్ని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం వహించ కూడదని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ రత్నమాల, జిల్లాలోని అన్ని మండలాల జడ్పిటిసి లు, జిల్లా అధికారులు, జడ్పి సూపరిండెంట్ తోట జి, తదితరులు పాల్గొన్నారు.