రామాలయం వద్ద ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్

Published: Wednesday February 02, 2022

జగిత్యాల, ఫిబ్రవరి 01 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణంలో 9వ వార్డ్ లో రామాలయం వద్ద ఓపెన్ జిమ్ ను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జగిత్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వైకుంఠ దామాలు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, మినీ ట్యాంక్ బండ్, రహదారుల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, 50 కోట్ల తో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కలెక్షన్ల పనులు సాగుతున్నాయని, 300కోట్లతో 4,500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఎస్ కెఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంతంలో, ఖీల గడ్డ, చింత కుంట, మినీ స్టేడియం ప్రాంతంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమని చాలామంది యువకులు, మహిళలు ధరూర్ క్యాంప్ లో వాకింగ్ చేస్తూ ఉంటారని వారందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.