:సెల్ టవర్ ప్రారంభ పనులను అడ్డుకున్న కాలానివాసులు .

Published: Monday February 08, 2021

క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన,

పురపాలక సంఘం గద్దెరగడి లో సెల్ టవర్ ఏర్పాటు పనులను  కాలాని వసూలు అడ్డుకొని, నిరసన తెలియజేశారు, ఆదివారం కాలనీవాసులు మాట్లాడుతూ ఇండ్ల మద్యలో సెల్ టవర్ యేర్పాటు చేయడం హేయమైనధీ కదు అన్నారు, గద్దె రాగాడి అభివృద్ధి చెందుతుందని యిక్కడ ఫ్లాట్ లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకు0టున్నాము అన్నారు,యిప్పుడు సెల్ టవర్ యేర్పాటు చేస్తే చిన్న పిల్లలు, వృద్ధులకు, గర్భిణులకు అనారోగ్యంకు గురి అవుతారని ఆరోగ్య సంస్థలు తెలియ జేసీనాట్లు గుర్తు చేశారు, ఇండ్ల మద్యలో  టవర్  యేర్పాటు చేయవద్దని జిల్లా కలెక్టర్, పురపాలక సంఘం కమిషనర్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు, టవర్ నిర్మాణ పనులు ప్రారంభం చేస్తే పనులను అడ్డుకుంటామని అన్నారు,  టవర్  నిర్మాణం పై కమీషనర్‌ను వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు యిచ్చినట్లు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,