ఘనంగా శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం

Published: Monday July 18, 2022
మేడిపల్లి, జూలై17 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్లోని శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు, మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సూరం రామ్ రెడ్డి, కమిటీ సభ్యులు మరియు  టిఅర్ఎస్ నాయకులు క్రిష్ణ రెడ్డి,మధుసూదన్ రెడ్డి ,ఇంద్రసేనా రెడ్డి,సంపత్ రావు,శ్రీనివాస్ రెడ్డి ,తుట్ నరసింహ,వెంపటి శ్రీను, డివిజన్ బీజేపీ అధ్యక్షులు బండారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిలు సంకూరి కురుమస్వామి ఉలుగొండ నారాయణదాసు తదితరులు పాల్గొన్నారు.