గాంధీ పార్కును అందంగా తీర్చిదిద్దుతాం

Published: Thursday August 05, 2021
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 04 ఆగస్ట్ ప్రజాపాలన : గాంధీ పార్కును అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఉన్న గాంధీ పార్కు ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయానికి గాంధీ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. పార్కులో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులు అవిశ్రాంతంగా పనులు చేస్తున్నారని వివరించారు. కన్నులకు ఇంపుగా కనబడే విధంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, శానిటేషన్ ఇస్పెక్టర్ నాగరాజు, మున్సిపల్ అధికారులు శివ, జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.