కాంతయ్యకు నివాళులర్పించిన ఎంపీపీ, జడ్పీటీసీ..
Published: Tuesday October 11, 2022
తల్లాడ, అక్టోబర్ 10 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన చీకటి కాంతయ్య ఇటీవల మృతిచెందారు. ఆయన సంస్మరణ సభ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పిటిసి దిరిశాల ప్రమీల హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో తెరాస జోనల్ చైర్మన్ దిరీశాల దాసురావు, సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు, దొడ్డ చిన్న శ్రీనివాసరావు, దుగ్గినేని సత్యనారాయణ, కొమ్మినేని శ్రీనివాసరావు, తుమ్మలపల్లి వెంకటయ్య, ఉన్నారు.
Share this on your social network: