సనత్ నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడిగా కొలను బాల్ రెడ్డి

Published: Wednesday September 29, 2021
అమీర్ పేట్ (ప్రజాపాలన ప్రతినిధి) : సనత్ నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొలను బాల్ రెడ్డి రెండోసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని నివాసంలో జరిగిన కార్యక్రమంలో బాల్ రెడ్డిని శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు పార్టీ మరింత పటిష్ట పరిచేందుకు కృషిచేస్తానని కొలను బాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొలను లక్ష్మిబాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. జనరల్ సెక్రటరీ ఫాజిల్, శేఖర్ లను, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజేష్ ముదిరాజ్ ను నియమించారు. డివిజన్లో కొత్తగా ఏర్పడిన కమిటీ సభ్యులందరికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా బాల్ రెడ్జి, కార్పొరేటర్ ల సహకారంతో పార్టీ ప్రగతికి మరియు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. రెండోసారి బాల్ రెడ్డిని నియమించడం పట్ల సనత్ నగర్ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో సురేష్ గౌడ్, భూపాల్ రెడ్డి, ఖలీల్ బేగ్, సరఫ్ సంతోష్, గోదాస్ కిరణ్, ఝాన్సీరాణి, పుష్పలత, జమీర్, రఫీక్, మరియు డివిజన్ బస్తీ నాయకులు పలువురు ఉన్నారు.