శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ నూతన పాలకవర్గం

Published: Saturday June 19, 2021
ఇబ్రహీంపట్నం, జూన్ 18 (ప్రజాపాలన ప్రతినిధి) : ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో గురువారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ నూతన పాలకవర్గం ఏర్పాటు చేయబడింది. ఆలయ కమిటీ చైర్మన్ కోటగిరి అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, వైస్ చైర్మన్ గా కొంపెల్లి రాజం కోశాధికారిగా అన్నారపు రాజారెడ్డి, కార్యవర్గ సభ్యులు జగదీష్, నరేష్, నర్సయ్య, లక్ష్మణ్, శ్రీధర్ ఎన్నికయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూతనంగా భాద్యతలను స్వీకరించారు. అనంతరం ఆలయ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ దేవాలయల అభివృద్ధికి సహకారం ఎక్కవేళలా అందిస్తూ హిందూధర్మ పరిరక్షణ కోసం తానెప్పుడు పాటుపడ్తానని అన్నారు.