పలు కార్యక్రమాలు హాజరైన మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధిర

Published: Saturday November 19, 2022

రూరల్ నవంబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు పలు కార్యక్రమాల్లో హాజరైనమాజీ పార్లమెంటు సభ్యులు *పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా ముందుగా ఎంప్లాయీస్ కాలనీ నందు ముస్లిం గ్యార్మీ జెండా ఊరేగింపు వేడుకకు హాజరయ్యారు. అనంతరం జిలిగుమాడు గ్రామంలో ఇటీవలే మరణించిన దోర్నాల కమలమ్మ  చిత్రపటానికి పూలమాలలు వేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం టీఆరెఎస్ పార్టీ కో-ఆప్షన్ సభ్యులు కొఠారి రాఘవ  తల్లి  మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారుపొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు, బొమ్మెర రామ్మూర్తి, జెడ్పీటీసీ శీలం కవిత, దేవి శెట్టి రంగారావు, సొసైటీచైర్మన్ కటికల సీతారామి రెడ్డి, చెరుకూరి నాగార్జున, కౌన్సిలర్ యర్రగుంట రమేష్, శీలం శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బొబ్బిల్లపాటి బాబురావు, అక్కినపల్లి నాగేశ్వరావు, చిలకా సత్యం, గుండ్ల రత్నబాబు, బాలు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు..