కుల సంఘాల అధివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
కోరుట్ల, జూలై 21 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలోని గౌడ సంఘ అభివృద్ధి పనులకు 2 లక్షల రూపాయలు, మరియు మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి 3 లక్షల రూపాయలు, వంజెరా సంఘం అభివృద్ధికి 2 లక్షల 50 వేల రూపాయలను సిడిపి నిధుల నుండి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుల సంఘాల నాయకులకు అందిచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల అభివృద్ధికై పాటుపడుతూ సంక్షేమ సహకారాలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు చీటి వెంకటరావు ,ఎంపీపీ తోట నారాయణ, టిఆర్ఎస్ పార్టీ కోరుట్ల మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్ మరియు గ్రామ సర్పంచు తుకారం గౌడ్ ,ఎంపీటీసీ గుగ్గిళ్ళ ప్రియాంక సురేష్,గ్రామ శాఖ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: