ఆటో డ్రైవర్లకు కూరగాయలు పంపిణీ

Published: Thursday May 13, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలోని ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు గొలుసుల శాంతి నర్సింహా సౌజన్యంతో కూరగాయలు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డేగల పాండు యాదవ్ చేతుల మీదుగా బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అయిటిపాముల సత్యనారాయణ, బిసి సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోలేపాక సత్యనారాయణ, ఆటో యూనియన్ అధ్యక్షుడు ఆదిమూలం రమేష్, నానచెర్ల వెంకటేష్, మైసోళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.