వైకుంఠధామం ను పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Published: Wednesday June 02, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని, వర్షాకాలం వస్తున్న సందర్భంగా ట్రంక్ లైన్ పనులు వైకుంఠధామం మొన్న కురిసిన వర్షాలకు పూర్తిగా నిండిపోయి అతలాకుతలం కావడంతో అక్కడున్న  వసతులను పరిశీలించారు. అన్ని పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ దీప్లాల్ చొవాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, కార్పొరేషన్ అధికారులు మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిధ్లల లావణ్య, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.