జాతర హుండీ ఆదాయం 9.5 లక్షలు
Published: Friday November 25, 2022
ఆలయ ధర్మకర్త ఎన్.పద్మనాభం వికారాబాద్ బ్యూరో 24 నవంబర్ ప్రజాపాలన : కార్తీక మాసం పెద్ద జాతర ఉండి ఆదాయం 9 లక్షల 5 వేల 874 రూపాయలు వచ్చిందని ఆలయ ధర్మకర్త ఎన్ పద్మనాభం ఈవో టి నరేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ఔట్ పోస్ట్ పోలీసులు, భక్తుల సమక్షంలో హుండి లెక్కించగా రూ.9,05,874 లు మాత్రమే ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్త ఎన్. పద్మనాభం , ఈఓ టి. నరేందర్ తెలిపారు. గత సంవత్సరం జాతర హుండి కంటే ఈ సంవత్సరం దాదాపు రూ. 2,70,000 లు ఎక్కువగా వచ్చిందని తెలిపారు.
Share this on your social network: