శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు

Published: Thursday December 02, 2021

జగిత్యాల, డిసెంబర్ 01 (ప్రజాపాలన ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని ఎన్ ఎస్ ఎస్ మరియు కళాశాల క్యాట్ టీం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన డా.తాటిపాముల సురేష్ పాల్గొన్నారు. ఎయిడ్స్ పై అవగాహన సదస్సులో మరియు విద్యార్థులచే మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డా.సురేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎయిడ్స్ పై అవగాహన కలిగిస్తూ ఎయిడ్స్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని దానికి మందు లేదని విద్యార్థులు ఎయిడ్స్ పై అవగాహన పెంచుకొని ఇతరులకు అవగాహన కలిగించాలని అన్నారు. ఈనాడు యువత డ్రగ్స్ కు బానిసలుగా మారడం వాటి వినియోగంలో సిరంజీలను స్టెరిలైజ్ చేయకపోవడంతో కూడా ఎయిడ్స్కు దారితీస్తుందని అన్నారు. ఆనంతరం రక్త దానం చేసిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ చెట్టపల్లి సుధాకర్ తోపాటు పలువురు ఉన్నారు.