రాయికల్ మండలంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన -- ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Saturday November 05, 2022

రాయికల్, నవంబర్ 04 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం సింగర్రావు పేట గ్రామానికి చెందిన గాజర్ల తిరుపతి మరణించగా వారి కుటుంబాన్ని, రాయికల్ పట్టణానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు ఇప్పకాయల నరసింగం మరణించగా ఆయన కుటుంబాన్ని, మండలంలోని కొత్తపేట వడ్డెర కాలానికి చెందిన ముల్క నాగరాజు ఇటీవల దుబాయ్ లో ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబాన్ని మరియు కొత్తపేట గ్రామానికి చెందిన పోచయ్య మరణించగా ఆ కుటుంబాన్ని మూటపల్లి గ్రామానికి చెందిన అబ్బూరి శాలిని అనారోగ్యంతో మరణించగా ఆమె కుటుంబ సభ్యులను పరమార్శించి అదే గ్రామానికి చెందిన ఎదురుగట్ల కృష్ణ చారి ఇమ్మనేని కరుణాకర్ రావులు అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా వారిని పరామర్శించారు. గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయినా ఒక లక్ష  రూ.ల విలువ గల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.అనంతరం అదే గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2 లక్షల రూ.లనిధులతో పూర్తి చేసిన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసి,ఆయా గ్రామాల సర్పంచులు,  ఎంపీటీసీలు,అధికారులు తెరాస మండల,పట్టణ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు .