విద్యుత్ ఉద్యోగుల పిఆర్సిని వెంటనే అమలు చేయాలని విద్యుత్ శాఖ ఉద్యోగులు

Published: Friday March 03, 2023

మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో,తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మధిర సబ్ డివిజన్ కార్యాలయ ప్రాంగణము నందు విద్యుత్ శాఖ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూయాజమాన్యం గత సంవత్సర కాలంగా పిఆర్సి కమిషన్ వేసి ఇంతవరకు దానిని అమలు చేయకపోవడంతో గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో వివిధ కేటగిరిలో పనిచేయుచున్నటువంటి ఉద్యోగులందరూ సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినారు. ఈ కార్యక్రమం అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సిహెచ్. ప్రభాకర్ రావు జే. ఏ. ఓ. లు రవి వర్మ, రాజేశ్వరి, చెరుపల్లి శ్రీధర్ 327 యూనియన్ నాయకులు జి. నరసింహారెడ్డి, ఎం. వెంకటేశ్వరావు 1104 నాయకులు శ్యాంసుందర్, షేక్ బాబు సాహెబ్ బాబు తదితర విద్యుత్ కార్మికులు, ఉద్యోగులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు.