నేడు ఉప్పల్ రింగ్ రోడ్లో బీజేపీ దళిత మోర్చా సింహగర్జన

Published: Monday April 03, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 2 (ప్రజాపాలన ప్రతినిధి)
నేడు ఉప్పల్ రింగ్ రోడ్లో బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో 24 గంటలు పాటు తలపెట్టిన దళిత సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ఏసురి యాదగిరి, మేడ్చల్ అర్బన్ జిల్లా  బిజెపి అధికార ప్రతినిధి సింగారం కార్తిక్ పిలుపునిచ్చారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత బంధు పథకం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే కాకుండా ప్రతి దళిత కుటుంబానికి అమలు చేయాలనే లక్ష్యంతో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో ఉప్పల్ రింగ్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద 24 గంటల పాటు తలపెట్టిన దళిత 
సింహగర్జన కార్యక్రమాన్ని బిజెపి నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో
ఉప్పల్ అసెంబ్లీ బిజెపి దళిత మోర్చా కన్వీనర్ తాళ్ళపాలి లింగం,
మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి దళిత మోర్చా కార్యదర్శి శామీర్పేట చంద్రయ్య,
ఉప్పల్ డివిజన్ బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు దువ్వల రమేష్, బిజెపి సీనియర్ నాయకులు
మీసాల జంగయ్య,ఉప్పల్ డివిజన్ బిజెపి మహిళ మోర్చా అధ్యక్షురాలు జ్యోతి,చిలుకానగర్ డివిజన్ బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు దాసరి యాదగిరి,చిలుకానగర్ డివిజన్ బిజెపి యువ మోర్చా అధ్యక్షులు డప్పు దత్త సాయి,ఉప్పల్ అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు గుండె పునెందర్,
అరుంధతి యువజన సంఘం కార్యదర్శి మేకల కృష్ణ  పాల్గొన్నారు.