అగ్రి సొసైటీ మార్కెటింగ్ ఉద్యోగుల సంఘము అధ్యక్షుడుగా అట్టేపల్లి సదానందం.

Published: Thursday January 27, 2022
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 26, ప్రజాపాలన : అగ్రి సొసైటీ మార్కెటింగ్ ఉద్యోగుల సంఘము అధ్యక్షుడుగా అట్టేపల్లి సదానందం ను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో అగ్రి సొసైటీ మార్కెటింగ్ ఉద్యోగుల సంఘము నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లాలోని అగ్రి సొసైటీలో పనిచేస్తున్న మార్కెటింగ్ ఉద్యోగులు అందరు కలిసి ఏకగ్రీవంగా ఆయన ను ఎన్నుకున్నారు, ఈ సందర్భంగా అగ్రి సొసైటీ నూతన అధ్యక్షులు మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని అగ్రి సొసైటీలోని మార్కెటింగ్ ఉద్యోగుల కష్టనష్టాల్లో ప్రత్యేక పాత్రపోసిస్తానని అన్నారు. సొసైటీ నూతన కార్యాలయం ఏర్పాటుకు, మరియు సొసైటీలో పనిచేస్తున్న మార్కెటింగ్ ఉద్యోగులందరికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్థానని తెలిపారు, కార్మికుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసారు. ఈ కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా దశారపు శ్రీనివాస్, తిరుపతి, ఐలయ్య, ప్రధాన కార్యదర్శి ఐ.రవీందర్ రావు,ట్రెసరర్ గంగయ్య, మహేష్, సీహెచ్ సత్యం, ప్రసాద్, గౌరవ అధ్యక్షునిగా గణేష్ రెడ్డి, ని ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆర్.ఆర్.పేర్టిలైసెర్ నాగేష్, శ్రీవాని పేర్టిలైసెర్ శ్రీధర్, పేర్టిలైసెర్ డీలర్ మిత్రులందరు పాల్గొన్నారు.