విద్యాసంస్థలు బంధు విజయవంతం
Published: Thursday July 21, 2022
జన్నారం, జూలై 20, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అన్నీ పాఠశాలలో వామపక్ష సంఘాల అదర్యంలో నిర్వహించిన విద్యాసంస్థలు బందు విజయవంతమైందని
ఏఐఎస్ఎఫ్ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ బుధవారం అన్నారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్య వ్యవస్థను పట్టించుకోవాలని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని అయన సూచించారు, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజును నియత్రించాలని ప్రభుత్వ పాఠశాలలకు అధిక మొత్తంలో నిధులు విడుదల చేయాలని పేర్కొన్నారు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈవో ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు, విద్యార్థి సంఘాలు ఒకటిగా వుండి విద్యార్థి సంస్థలు లోకాన్ని ఏకం చేసి భవిష్యత్తులో ఉద్యమాలకు సిద్ధమవుతామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు రాకేష్ ,అస్లం, ఏజాస్, ఎ ఐ ఎస్ బి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుండ్రా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: