పట్టణ ప్రగతి కార్యక్రమం
Published: Saturday July 03, 2021
మధిర, జులై 02, ప్రజాపాలన ప్రతినిధి : 12వ వార్డు లో మొండితోక పట్టణ ప్రగతి సమస్యలు నాగరాణి సుధాకర్ (మాజీ:చైర్పర్సన్) ఆధ్వర్యంలో ముమ్మరంగా పట్టణ ప్రగతి వార్డ్ లో పలు సమస్యలను గుర్తించి పరిష్కర కార్యక్రమంలో వోల్టేజ్ సమస్య గుర్తించి ట్రాన్స్ఫార్మర్స్ మార్పురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం 2 వ రోజు మాజీ చైర్పర్సన్ 12వ వార్డు కౌన్సిలర్ మొండితోక నాగరాణి సుధాకర్ఆధ్వర్యంలో ఈ రోజు మొదట గా డ్రై డే కార్యక్రమం నిర్వహించి తదుపరి కాలి ప్రదేశాలులో చెత్త పేరుకు పోయిన ప్రదేశాలులో ఆయా ప్రదేశ యజమానులకు శుభ్రంగా ఉంచుకోమని సూచించారు. తదుపరి 12వ వార్డు ప్రధాన సమస్యగా లో వోల్టేజ్ తో ఇబ్బంది పెడుతున్న సమస్య ను గుర్తించి విద్యుత్ అధికారులతో మాట్లాడి కొత్త ట్రాన్ఫార్మర్ ను పట్టణ ప్రగతి లో భాగంగా వేయించడం జరిగింది. ట్రాన్ఫార్మర్ ను మార్పుకు సహకరించిన విద్యుత్ అధికారులకు ధన్యవాదాములు తెలిపారు.. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, Rp చిన్నారి ఆశ వర్కర్ సుజాత, అంగన్వాడీ కార్యకర్త ఝాన్సీ, వార్డ్ ఇంచార్జి కటుకురి రాజీవ్ మరియు వార్డ్ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: