*దర్గా అభివృద్ధికి కృషి చేస్తా జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి* *షాబాద్ పైల్వాన్ -షా-వాలి దర్గ

Published: Thursday January 12, 2023

*ప్రజాపాలన షాబాద్*==ప్రఖ్యాత షాబాద్ పైల్వాన్ -షా-వాలి దర్గాను జెడ్పిటీసీ పట్నం అవినాష్  రెడ్డి సందర్శించారు. దర్గా ఉర్స్ ఉత్సవాలలో భాగంగా ఆయన బుధవారం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ షాబాద్ ప్రాంత ఆరాధ్యుల ధైవంగా నిలుస్తున్న పైల్వాన్ -షా-వాలి దర్గా అభివృద్ధికి తన వంతుగా కృషిచేస్తానని తెలిపారు. ఈ దర్గా ఉర్సులో షాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఉరుసులో పాల్గొంటారు దర్గా కమిటీ సభ్యులు జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డిని పూలమాలలు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్తార్, అజీమ్, మసూద్, తాజ్, ముఖురామ్ , సలీం,ఆరీఫ్,షమీమ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నక్క శ్రీనివాస్ గౌడ్,మాజీ సర్పంచ్ వెంకటయ్య, సీనియర్ నాయకులు జెడల రాజేందర్ గౌడ్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.