జర్నలిస్టులకు నిత్యవసర వస్తువుల పంపిణీ
Published: Friday August 13, 2021
వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి మండల కేంద్రంలో గురువారం పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షుడు పసల విజయానంద్ జర్నలిస్టులకు నిత్యవసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి సమాజం కోసం నిరంతరం పాటుపడే జర్నలిస్టులు ఎంతో శ్రమిస్తూ ఉంటారని వారి శ్రమకు విలువ కట్టలేని తనకు తోచిన విధంగా కొంత సహాయాన్ని అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పనుమటి దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివనాదుల రమేష్, గనేబోయిన నరసింహ, కూర శ్రీనివాస్, కట్టా శ్రీనివాస్, వెలిమినేటి రమేష్, సురేష్, అరుణ్, నజీర్, శ్రీకాoత్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: