*పది లోగా ఓపెన్ స్కూల్లో చేరాలి*

Published: Wednesday November 02, 2022

మధిర రూరల్ నవంబర్ 1 (ప్రజాపాలన ప్రతినిధి) చదువు మధ్యలో నిలిపేసిన వారు నేరుగా ఓపెన్ స్కూల్లో చేరి చదువును కొనసాగించుకోవచ్చని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ పాపారావు కోరారు. మంగళవారం తహసీల్దార్ మరియు ఎంపీడీవో కార్యాలయంలో ఓపెన్ స్కూలుకు సంబంధించిన గోడపత్రికలను డిప్యూటీ తహసీల్దార్ రాజేష్ ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో చేరేందుకు ఈనెల 10వ తేదీ వరకు అవకాశం ఉన్నదన్నారు. అర్హులైన వారు ప్రవేశం పొందాలనుకునేవారు మధిర టీవీఎం పాఠశాలలో 9441018685 నంబర్లో సంప్రదించవలసినదిగా ఆయన కోరారు.