కాంగ్రెస్ గడప గడపకు ప్రచారం --దండెం రాంరెడ్డి

Published: Monday October 17, 2022

చౌటుప్పల్ ,అక్టోబర్ 16,( ప్రజాపాలన ప్రతినిధి):మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అది ఆదివారం రోజు చౌటుప్పల్ మండలం, ధర్మాజీ గూడెం గ్రామంలో ఇంటింటికీ, ప్రతి గడప గడపకు వెళ్లి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దండెం రాంరెడ్డి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ప్రతి పేదవాడి సమస్యను వారి జీవనశైలి ఎలా ఉంది అని తెలుసుకుంటూ, ప్రతి కులాల వారి వారి జీవన ఉపదులను అడిగి తెలుసుకుంటూ, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు జీవన ఉపాధి కల్పించిందని, అన్ని కులాల వారి వృత్తులను ప్రోత్సహిస్తూ వచ్చింది అని, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఉన్నపుడు చేసిన అభివృద్ధిని, మరియు పేదవాడి కోసం కాంగ్రెస్ తెచ్చిన పథకాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో మునుగోడు కు చేస్తున్న అన్యాయాన్ని అదేవిధంగా కేంద్రంలో బిజెపి పాలనలో పెరుగుతున్న ధరలను గురించి ప్రజలకు వివరించారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె అందరి సమస్యలు తీరతాయని, మొదటి అడుగు మునుగోడు నుండే పడాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు వళ్ళబోతు నారాయణ, సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ బత్తుల శ్రీహరి, కోంతం పద్మమ్మ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఊదరి శ్రీనివాస్,వార్డు మెంబర్ ఉదరి జయమ్మ లింగయ్య, ఎన్ ఎస్ యు ఐ మునుగోడు అసెంబ్లీ అధ్యక్షుడు రాచకొండ భార్గవ్, కొంతం జంగా రెడ్డి,జువ్వి నర్సింహ, బద్రి పోశయ్య, ఊదరి శంకర్, ఊదరి ఇస్తారి, ఐతరాజు శివ, ఊదరి స్వామి, వళ్లబోతు నరేష్, వళ్లబోతు సురేష్, బత్తుల వినోద్, వళ్లబోతు సంపత్, జంగం సందీప్, జంగం కిరణ్ , వల్లబోతు స్వామి, మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.