"నేడు ఆర్డిఓ కార్యాలయాల ఎదుట జర్నలిస్టుల నిరసన" ** టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రహమాన్ **
Published: Wednesday February 22, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 21 (ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లాలోని జర్నలిస్టుల దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దశల వారి ఆందోళనలో భాగంగా రెండవ దశ ఈనెల 22న నిర్వహిస్తున్న ఆర్టీవో కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాన్ని జిల్లాలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఐకెయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శు అబ్దుల్ రహమాన్, సంపత్ కుమార్ లు పిలుపునిచ్చారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారని, సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వలు పట్టించుకోవడంలేదని, ఆవేదన వ్యక్తంచేశారు. ఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెండవ దశలో భాగంగా ఆసిఫాబాద్, కగజ్ నగర్, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఉదయం 11:30 గం కు ఆందోళన నిర్వహించి ఆనంతరం వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని,ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టులు జయప్రదం చేయాలని జయప్రదం చేయాలనీ కోరారు.
Share this on your social network: